ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత 12 మెట్ల కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగ‌ల‌య్య‌కు స‌న్మానం

  రంగారెడ్డి జిల్లా కోర్ట్‌, ఏప్రిల్  3  ( అద్దం న్యూస్ ) :   ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత 12 మెట్ల కిన్నెర క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగ‌ల‌య్య‌కు గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా స‌న్మానం జ‌రిగింది. న్యాయ‌వాది, తెలంగాణ అడ్వ‌కేట్ జెఎసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి, న్యాయ‌వాదులు జి.రామారావు, సిహెచ్‌.ఉపేంద‌ర్, కొంతం గోవ‌ర్థ‌న్‌రెడ్డి, మంత్రి ర‌వీంద‌ర్‌, డి.రామ్‌రెడ్డి, న‌ర్సింగ్, నాగేశ్వ‌ర్‌రెడ్డి, ఎన్‌.కృష్ణ త‌దిత‌రులు మొగ‌ల‌య్య‌కు శాలువాలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు.