పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి – వక్తలు
పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి హైదరాబాద్, జనవరి 26, అద్దం న్యూస్ : పద్మశాలీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏటా జరిగే పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక ( మేళా ) ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ మేళాకు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్.కె.లక్ష్మణ్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్, కవాడిగూడ, గాంధీనగర్ డివిజన్ల కార్పొరేటర్లు రచన...