Addam News
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 12:06 am Posted by : Addam News

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో పంచాంగ శ్ర‌వ‌ణం

హైదరాబాద్, అద్దం న్యూస్ : హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్‌లోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ఆదివారం సాయంత్రం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్ర‌వ‌ణం కార్య‌క్ర‌మం జ‌రిగింది. అర్చ‌కులు బుగ్గ ల‌క్ష్మీప‌తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో పంచాంగ శ్ర‌వ‌ణం జ‌రిగింది. ఆయ‌న పంచాంగాన్ని వినిపించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌, రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యులు ప‌ద్మావ‌తి, నిర్మ‌ల‌, రామ‌కృష్ణ‌, గండి హ‌రీష్‌, శ్యామ్ ముదిరాజ్‌, నీతారాణి, ల‌క్ష్మీనారాయ‌ణ‌, సుబ్బారావు, బాల‌కుమార్‌, న‌వీన్ ప్ర‌సాద్‌, వెంక‌ట శిశుకుమార్‌, ప్ర‌తాప్‌కుమార్‌, లోక్‌నాథ్‌, వెంక‌ట‌రావు, గ‌ణేష్‌, రామ‌కోటేశ్వ‌ర‌రావు, మోహ‌న్‌రావు, ఆల‌య అర్చ‌కుడు వెంక‌టాద్రి, భ‌క్తులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png