పంచాయతీ ఎన్నికలు.. ఉరుమడ్లలో ఉద్రిక్తత

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సర్పంచి ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. BRS నేత, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.. డైరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్‌ రెడ్డి మాటల యుద్ధానికి దిగారు. ఈక్రమంలో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి అదనపు బలగాలను మోహరించారు.