Addam News
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 1:43 am Posted by : Addam News

సూక్ష్మ వ్యాపారాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

అంబ‌ర్‌పేట్‌, మే 26, అద్దం న్యూస్ :   సూక్ష్మ వ్యాపారాలపై అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని తీసుకెళ్లాలని కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రి జీతన్ రామ్ మాన్ జి సూచించారు. సోమ‌వారం హైదరాబాద్ యూసఫ్‌గూడ‌లోని మైక్రో, చిన్న పరిశ్రమల వ్యాపారాల సంస్థ కార్యాలయంలో సూక్ష్మ వ్యాపారాల ఎక్సిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జీతన్ రామ్ మాన్ జి మాట్లాడుతూ.. యువత సూక్ష్మ వ్యాపారాలపై దృష్టి సారించాలన్నారు. యువత తమ కాళ్ళ పైన నిలబడి, సగర్వంగా సమాజంలో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట కార్యదర్శి జయశ్రీ, బీజేపీ తెలంగాణ సంస్థా గత ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారిణి, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి, ప్రకృతి స్వచ్ఛంద‌ సంస్థ నిర్వాహకులు మాధవ రావు, కిరణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png