ఉల్లాసంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం
ఉల్లాసంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం హైదరాబాద్, ఫిబ్రవరి 1, అద్దం న్యూస్ : ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025-26 క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ మహిళా మ్యూజిక్ చైర్ పోటీలు చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్, గాంధీనగర్ కెనరా బ్యాంక్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరయ్యారు. పోటీల్లో ఉత్తేజాన్ని కల్పించేందుకు మహిళలతో కలిసి కార్పొరేటర్ పావని పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో...