Addam News
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 5:24 am Posted by : Addam News

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో రాజీవ్ గాంధీ జ‌యంతి

హైద‌రాబాద్ న‌గ‌ర గ్రంథాల‌యంలో రాజీవ్ గాంధీ జ‌యంతి

హైదరాబాద్, ఆగ‌స్టు 20, అద్దం న్యూస్ :    భార‌త దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ జ‌యంతి కార్య‌క్ర‌మం బుధ‌వారం హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పి.పద్మజ లు హాజ‌రై రాజీవ్‌గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమములో నగర గ్రంధాలయ సంస్థ ప్రధమ శ్రేణి గ్రంధపాలకురాలు ఎల్.చంద్రకళ, నగర గ్రంధాలయ సంస్థ ద్వితీయ శ్రేణి గ్రంధపాలకురాలు బి.ప్రతిభ రెడ్డి, హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ సీనియర్ అసిస్టెంట్ అవినాష్, టెక్నికల్ సెక్షన్ ఉద్యోగులు, శాఖా గ్రంధాలయాల ఉద్యోగులు, విద్యార్థులు, పాఠ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png