జలమండలిలో 13 మంది ఉద్యోగులు పదవీ విరమణ
హైదరాబాద్, జూన్ 3, అద్దం న్యూస్ : జలమండలి పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 13 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరందరిని ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం సరస్వతి, ఉద్యోగులు పాల్గొన్నారు.