లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న రేవంత్ – బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్
తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మళ్లీ తన అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్.ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. గురువారం సమావేశంలో ఆర్ఎస్పి మాట్లాడుతూ... దళిత, గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కేటీఆర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా బుక్ చేస్తారు ? ఎస్సీ, ఎస్టీలను నట్టేట ముంచిన...