రెవెన్యూ పెంచాలి – జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్

  హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :   రెవెన్యూ పెంచాలని జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ అన్నారు. జలమండలి అధికారులతో బుధవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలోఆయ‌న‌ రెవెన్యూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ... రెవెన్యూ పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ఇప్పటీ వరకు అధిక బకాయిఉన్న కనెక్షన్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రతినెల బోర్డుకు మరింత ఆదాయం సమకూరనుందన్నారు. అలాగే వాణిజ్య క‌నెక్ష‌న్ల బకాయిల పైన దృష్టి సారించాల‌ని, దీర్ఘ...