అమెరికాలో రోడ్డు ప్రమాదం – మహబూబాబాద్ కు చెందిన యువతులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం – మహబూబాబాద్ కు చెందిన యువతులు మృతి అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ యువతులు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన లు ఉన్నత చదువుల కోసం అమెరికా కు వెళ్ళారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిద్దరు మృతి చెందారు.