Addam News
Newspaper Banner
Date of Publish : 04 June 2025, 3:41 am Posted by : Addam News

Royal Challengers Bengaluru vs Punjab Kings, IPL 2025 Final: పంజాబ్‌పై .. బెంగళూరు ఘన విజయం

Royal Challengers Bengaluru vs Punjab Kings, IPL 2025 Final : పంజాబ్‌పై .. బెంగళూరు ఘన విజయం

స్పోర్ట్స్, జూన్ 3, అద్దం న్యూస్ :   ఐపిఎల్ చ‌రిత్ర‌లో 2008, 2011, 2026 ఫైనల్స్ ఓడిపోయిన తరువాత, అదృష్టం చివరకు 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరింది. ఆర్ సిబి మొదటిసారి ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి, తొలి ట్రోఫీని ముద్దాడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తొలి టైటిల్‌ను గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో IPL 18వ సీజన్‌లో 8వ ఛాంపియన్‌గా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లలో 190 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయిన తరువాత మొదట బ్యాటింగ్ చేశారు. బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జితేష్ వేగంగా బ్యాటింగ్ చేసి 240 స్ట్రైక్ రేట్‌తో 10 బంతుల్లో 24 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్యా 17 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామిసన్ 3-3 వికెట్లు పడగొట్టారు. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పీబీకేఎస్ 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.

18 ఏళ్ల క‌ల నెర‌వేరిన వేళ కంట‌త‌డిపెట్టిన కోహ్లీ :

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS)ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మొట్ట మొదటి సారిగా టైటిల్‌ను కైవసం చేసుకున్న క్షణం, ఆ జట్టు మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. మైదానంలోని సహచరులతో కలిసి సంబరాలు చేసుకుంటూనే కోహ్లీ కళ్లు చెమర్చాయి. 18 సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సార్లు అందని ద్రాక్షగా ఊరించిన ట్రోఫీ ఎట్టకేలకు సొంతమవడంతో కోహ్లీ మైదానంలోనే ఆనందభాష్పాలు రాల్చాడు. విరాట్ కోహ్లీ మోకాళ్లపై కూర్చొని, ముఖం చేతులతో కప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ కన్నీళ్లలో సంవత్సరాల పోరాటం, జట్టు పట్ల అతనికున్న అంకితభావం, అభిమానుల ఆశలను నెరవేర్చానన్న సంతృప్తి అన్నీ కలగలిసి కనిపించాయి. సహచరులు, సహాయక సిబ్బంది వచ్చి అతడిని ఓదార్చినా, ఆ భావోద్వేగ ప్రవాహాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఆర్‌సి‌బి జెండాను పట్టుకుని మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తున్నప్పుడు కూడా అతని కళ్లలో ఆనందభాష్పాలు మెరుస్తూనే ఉన్నాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను క‌ల‌చివేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png