యూట్యూబర్ జ్యోతితో సహ 11 మందిపై దేశ ద్రోహం కేసు – పాక్ కోసం ప‌ని చేస్తున్న‌ట్లు బ‌య‌ట‌పెట్టిన నిఘా వ‌ర్గాలు

వెబ్ డెస్క్, మే 20, అద్దం న్యూస్ :   ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి త‌ర్వాత ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో భార‌త దేశ సైనికులు ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త‌దేశంలో న‌క్కి ఉన్న పాకిస్థాన్ గూఢ‌చ‌ర్య ఆన‌వాళ్ల‌పై నిఘా వ‌ర్గాలు దృష్టిపెట్టాయి. ఈ క్ర‌మంలోనే భార‌త‌దేశంలోని హ‌ర్యానా, పంజాబ్‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన 12 మంది పాక్ కోసం ప‌ని చేస్తున్న‌ట్లు నిఘా వ‌ర్గాలు గుర్తించాయి. ఇందులో ఒక మ‌హిళా ఫేమ‌స్ యూట్యూబ‌ర్ కూడా ఉన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయ‌బార...