ఎస్జి సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి – నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ పొట్టపెంజర రమేష్
హైదరాబాద్, జూన్ 1, అద్దం న్యూస్ : తమ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి, కోట్ల రూపాయలు దండుకున్న ఎస్జి ఎంటర్ప్రైజెస్ నిర్వా హకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ పొట్టపెంజర రమేష్, డిప్యూటీ చైర్మన్ తికుంట్ల విశాల్ లు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటర్గా...