శాంతమ్మ సమర గాథ సీడి ఆవిష్క‌ర‌ణ

హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ :   బదనకల్ అమరుల 20వ వర్ధంతిని పురస్కరించుకొని అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ జరిగింది. ఈ సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు జోహార్లు చెబుతూ రెండు నిమిషాలు మౌనం పాటించడం, తదనంతరము సంస్మరణ సభకు హాజరైన వక్త‌లందరూ అభివాదం తెలియజేయడం జరిగింది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గానం చేసిన శాంతమ్మ సమర గాథ‌ ( శాంతి సమరయోధుల) పాటను బదనకల్ అమరుడు పెద్ది యాదగిరి ( రాజు...