• మేదర్ బస్తీ, న్యూ అచ్చయ్యనగర్ బస్తీల్లో మంచినీటి సమస్యను పరిష్కరించండి • చిలకలగూడ వాటర్వర్క్స్ కార్యాలయం ఎదుట ధర్నా
ముషీరాబాద్, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ మేదర్ బస్తీ, న్యూ అచ్చయ్యనగర్ల్లల్లో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా రావడంలేదని, వెంటనే మంచినీటి సరఫరా చేయాలని బిజెపి ఎస్సీ మోర్చ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్ డిమాండ్ చేశారు. రాంనగర్ డివిజన్ మేదర్ బస్తీ, న్యూ అచ్చయ్యనగర్ల్లల్లో మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం చిలకలగూడ వాటర్వర్క్స్ కార్యాలయం వద్ద గడ్డం నవీన్ ఆధ్వర్యంలో బస్తీవాసులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా...