ముగిసిన తెలంగాణ బాలోత్సవం సమ్మర్ క్యాంప్
హైదరాబాద్, మే 22, అద్దం న్యూస్ : తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో గత 18 రోజుల పాటు సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ముగింపు కార్యక్రమం సందడిగా జరిగంది. ఈ సందర్భంగా పిల్లల నేస్తం తెలుగు మాష్టారు అంకమ్మ మాట్లాడుతూ.. విలువల బడిగా - సృజనకు గుడిగా సమ్మర్ క్యాంపు 18 రోజులు విజ్ఞాన దాయకంగా దేశభక్తియుతంగా, సందేశాత్మక మైన పాటలతో తల్లిదండ్రులు మంత్రముగ్ధుల్ని చేసారన్నారు. ఆడపిల్లలు కన్నీళ్లు కాదు కన్నెర్ర చేయాలని, ఏడుపు కాదు...