కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ బ్యూరో, ఆగస్టు 12, ( అద్దం న్యూస్ ) : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదని విజయ్ గోపాల్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన గడువులోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో ఈ పథకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ![]()












Leave a Reply