తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

హ‌న్మ‌కొండ, ఏప్రిల్ 3 ( అద్దం న్యూస్ ) : ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని, ప్రింటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రుగ‌నున్న తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర క‌మిటీ పిలుపునిచ్చింది. గురువారం హ‌న్మ‌కొండ జిల్లా కేంద్రం అంబేద్క‌ర్ సెంట‌ర్ వ‌ద్ద డిజిట‌ల్ మీడియా జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎంపెల్లి ముత్తేష్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల...