సనత్నగర్ నియోజకవర్గంలో హోరెత్తిన ‘ తెలుగుదేశం – ప్రజాపథం ‘
సనత్నగర్ నియోజకవర్గంలో హోరెత్తిన ' తెలుగుదేశం – ప్రజాపథం ' – ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలంటూ టీడీపీ శ్రేణుల పిలుపు ! సనత్నగర్, జూలై 22, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన " తెలుగుదేశం – ప్రజాపథం " కార్యక్రమం బుధవారం సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా జరిగింది. సనత్నగర్ డివిజన్ పరిధిలోని ఇ-సేవా కేంద్రం వద్ద పార్టీ జెండాను...