దేవాల‌యాల అభివృద్ధికి ఆల‌యాల క‌మిటీ స‌భ్యులు కృషి చేయండి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : దేవాల‌యాల అభివృద్ధి కోసం ఆల‌యాల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ స‌భ్యులు కృషి చేయాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ రాంన‌గ‌ర్ రామాల‌యం నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకారం శ‌నివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో ల‌క్ష్మారెడ్డి నూత‌న పాల‌క‌మండ‌లి స‌భ్యుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌గా వి.ఆనంద్ ముదిరాజ్ ప్ర‌మాణ‌స్వీకారం...