ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి – ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి అశోక్కుమార్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.భూంపల్లి అశోక్కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆరెకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ మాట్లాడుతూ... నిజాం కాలం నుండి నేటి వరకు ఒక అణా పైసా నుండి నేడు రూ.25 లు వరకు మేకను వధించినందుకుగాను ప్రభుత్వానికి పన్ను రూపంలో ప్రతి మేకల...