రాష్ట్రంలో సరిగ్గా అమలు కానీ రైతు భరోసా పథకం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ : రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ప్రభుత్వం చేపట్టిన పథకం రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు భరోసా పథకం కింద దరఖాస్తు చేసుకునే రైతులు నేటితో గడువు ముగుస్తుండడంతో చాలా మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రైతు భరోసా...