గణేష్ మండపాలను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ బండి సంజయ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లోని విఘ్నేశ్వరుడి విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అడిక్మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పాశం సాయికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర నాయకుడు రొయ్యూరు...