మధుయాష్కి గౌడ్ ను కలిసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ : టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ను ఆయన నివాసంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఉప్పల శ్రీనివాస్ గుప్త ను మధుయాష్కి గౌడ్ అభినందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మధుయాష్కి గౌడ్ సూచించారు.