Addam News
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 12:13 pm Posted by : Addam News

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స్వామి వారికి వ‌సంతోత్స‌వం

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో స్వామి వారికి వ‌సంతోత్స‌వం

ముషీరాబాద్, ఫిబ్రవరి 16, అద్దం న్యూస్ :   మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోట శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో సోమ‌వారం స్వామి వారికి వ‌సంతోత్స‌వం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగింది. అలాగే నానా ఫల రసాభిషేకం, రుద్ర సహిత చండీహోమం, తైలాభిషేకం, అన్నాభిషేకం, మహా నివేదన, మంత్రపుష్పం, వనభోజనోత్సవాలు త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య కార్యనిర్వాహణ అధికారి బి.జ్యోతి, ఆల‌య క‌మిటీ చైర్మ‌న్ మేడి సురేష్‌, ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్‌, ఆలయ ధర్మకర్తలు లక్ష్మణ్, నీల్ చందర్, సూర్య చంద్రశేఖర్, సాయిబాబా, సురేందర్, శ్వేత‌, న‌ర్సింగ‌రావు, క్రాంతి, ప‌ర‌మేష్‌, వైపి.రాజు, ఎం.రాజు, మ‌హేష్‌కుమార్‌, త‌లారి న‌ర్సింగ్‌రావు, కిషోర్ యాద‌వ్‌, రంజిత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png