గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న వినయ్ కుమార్
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న వినయ్ కుమార్ ముషీరాబాద్, సెప్టెంబర్ 05, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో వినాయకుల విగ్రహాల నిమజ్జనం ఊరేగింపు జరిగింది. గాంధీనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఊరేగింపును ప్రారంభించారు. ...