Addam News
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 11:10 am Posted by : Addam News

న‌గ‌రంలో ప్రారంభ‌మైన వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాలు

న‌గ‌రంలో ప్రారంభ‌మైన వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాలు

హైదరాబాద్, ఆగ‌స్టు 27, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాలు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. వాడ వాడ‌ల్లో ఏర్పాటు చేసిన మండ‌పాల్లో వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించి తొలి పూజ‌ల‌ను చేశారు. దీంతో పాటు ఆల‌యాల్లో సైతం వినాయ‌కుడి విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించి పూజ‌లు చేశారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ప్ర‌తిష్టించిన వినాయ‌కుడికి అర్చ‌కులు పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యుడు శ్యామ్ ముదిరాజ్‌, భ‌క్తులు పాల్గొన్నారు.

శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో ఉత్స‌వాలు ప్రారంభం :

ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో వినాయ‌క‌చ‌వితి పండుగ సంద‌ర్భంగా గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాన్ని సుంద‌రంగా అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ మారిశెట్టి న‌ర్సింగ్‌రావు, ఆల‌య ఈవో ల‌క్ష్మారెడ్డి, అర్చ‌కులు, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png