జలమండలి ఈడీ పర్యటన

  హైదరాబాద్, అద్దం న్యూస్ : లక్డికపూల్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో మురుగునీటి ఓవర్‌ఫ్లో సమస్యను జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ అధికారులతో బుధ‌వారం ప‌రిశీలించారు. అలాగే, ప్రాజెక్టు డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 400 ఎంఎం డయా ఆర్‌సీసీ సీవరేజ్ లైన్ టన్నెలింగ్ పనులను పరిశీలించారు. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద మురుగునీటి లోడ్‌ను మళ్లించి, తరచూ జరిగే ఓవర్ ఫ్లోను నివారించేందుకు శాశ్వత చర్యల కోసం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.