Addam News
Newspaper Banner
Date of Publish : 30 March 2025, 1:21 am Posted by : Addam News

కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ‌ స‌ర్టిఫికెట్లను స‌కాలంలో అంద‌చేస్తున్నాం – ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్ సింగ్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ :    కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ‌ స‌ర్టిఫికెట్లను స‌కాలంలో అంద‌చేస్తున్నామ‌ని ముషీరాబాద్ మండ‌లం త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్ సింగ్ అన్నారు. అద్దం న్యూస్ ప్ర‌తినిధితో ఆయ‌న మాట్లాడుతూ.. స్వయం ఉపాధి వెంచర్‌లకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకులు తమ సొంత వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించడానికి సబ్సిడీలతో పాటు రూ. 3 లక్షల వరకు రాయితీ రుణాలను పొందవచ్చన్నారు. ఈ పథకం ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం ద్వారా యువతకు వారి వ్యవస్థాపక ప్రయాణాలలో విజయం సాధించడానికి సాధనాలతో సాధికారత కల్పించడమే రాజీవ్ యువ వికాసం లక్ష్యమ‌న్నారు. మార్చి 15వ తేదీ నుంచి ముషీరాబాద్ మండ‌లం ప‌రిధిలో కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాల కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారికి స‌కాలంలో స‌ర్టిఫికెట్ల‌ను అంద‌చేస్తున్నామ‌న్నారు. కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాల కోసం ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png