Addam News
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 3:38 am Posted by : Addam News

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు పాటు ప‌డాలి

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు పాటు ప‌డాలి
– ఆర్టీసి గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్ ఎ.శ్రీధ‌ర్

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 7, ( అద్దం న్యూస్ ) :    ప్ర‌తి ఒక్క ఉద్యోగి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు పాటుప‌డాలని ఆర్టీసి గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్ ఎ.శ్రీధ‌ర్ అన్నారు. శుక్ర‌వారం ముషీరాబాద్ ఆర్టీసి డిపోను గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్ ఎ.శ్రీధ‌ర్, హైద‌రాబాద్ రీజిన‌ల్ మేనేజ‌ర్ వై.ల‌త సంద‌ర్శించారు. డిపో అభివృద్ధికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల గురించి డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్ కు సూచించారు. ఉద్యోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్ ఎ.శ్రీధ‌ర్ మొక్క‌ను నాటారు. ప‌ర్యావ‌ర‌ణం బాగుంటేనే ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్యంగా ఉంటార‌ని ఈడి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఆర్ఎం ఆప‌రేష‌న్స్ బాబు నాయ‌క్‌, డిప్యూటీ ఆర్ఎం మెకానిక‌ల్ శంక‌ర్‌, డిపో మేనేజ‌ర్ జె.విజ‌య్‌, ఏఎం ( టి ) కె.శ్రీనివాస్‌, ఏఎం ( ఈ ) డి.చంద‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png