అరుంధతినగర్ బస్తీలో స‌మ‌స్య‌ల‌ను శాశ్వతంగా ప‌రిష్క‌రిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

  హైదరాబాద్, అద్దం న్యూస్ :   అరుంధతినగర్ బస్తీవాసుల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. బ‌స్తీవాసుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులు, డిప్యూటీ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్ వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేష్, వాటర్ వర్క్స్ సూప‌ర్‌వైజ‌ర్‌ శంకర్,  జగన్ వారి సిబ్బందితో కలిసి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అరుంధతినగర్ బ‌స్తీలో గురువారం పర్యటించారు.  బస్తీలో మంచినీటి సరఫరాలో పైప్‌లైన్ల వ్యవస్థ పూర్తిగా...