ఆర్థిక ఇబ్బందులతోనే స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మనోజ్ కుమార్ మృతికి గల కారణం ఆర్థిక ఇబ్బందులు, అప్పల భారమే అని తెలిసింది. చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపిన వివరాలు ప్రకారం... ముషీరాబాద్ పరిధిలోని పార్శీగుట్టకు చెందిన సోమారపు మనోజ్ కుమార్ ( 29 ) ప్రైవేట్గా ఇంటింటికీ తిరిగి అపోలో హాస్పిటల్స్...