డ్రంకన్ డ్రైవ్ కేసులో 43 మంది అరెస్టు
38 మందికి జరిమానా, 5 గురికి జైలు శిక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 18, అద్దం న్యూస్ : చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్న వారికి జరిమానాలను విధిస్తూ జైలుకు పంపుతున్నారు. వరుస డ్రంకన్ డ్రైవ్ పేరుతో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 43 మందిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అందులో 38 మందికి జరిమానా, ఇద్దరికీ 3 రోజుల జైలు, జరిమానా విధించడంతో పాటు ఒకరికి 6 రోజుల జైలు, జరిమానా, మరో ఇద్దరికి 11 రోజులు జైలు విధించింది. వారి చేత 1,28,300 రూపాయల జరిమానాను కట్టించినట్లు చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.ఏడుకొండలు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply