హైదరాబాద్, అద్దం న్యూస్ : నగరంలోని ఇందిరాపార్క్లో జరిగిన హోలి వేడుకలకు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి వాకర్లతో కలిసి రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాటలకు వారు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బండారు విజయలక్ష్మీ మాట్లాడుతూ… హోలి వేడుకలను సాంప్రదాయ రంగులతోనే నిర్వహించుకోవాలన్నారు. ప్రజలందరూ హోలి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జి.వెంకటేష్, పరిమల్కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్కె.శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply