అద్దం న్యూస్, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్లలోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో 6, సైబరాబాద్లో 3, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనరేట్లో శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు కలిసే అవకాశముంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైతం దాని పరిధిలోకే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగితే పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించనున్నారని సమాచారం.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.pngకమిషనరేట్లలోనూ మార్పులు..?












Leave a Reply