ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడి ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడి ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది
– సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, క్రిస్టియ‌న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దీప‌క్ జాన్‌

సికింద్రాబాద్‌, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ :   ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోడి ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంది సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, క్రిస్టియ‌న్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దీప‌క్ జాన్ అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ ప‌ద్మారావున‌గ‌ర్‌లోని డిసిసి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో దీప‌క్ జాన్ మాట్లాడుతూ… మహిళా సాధికారత పేరుతో కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన నారీ శక్తి వందన్ అధినియమ్ వెనుక ఉన్న అసలు రంగు నేడు లోక్‌సభ వేదికగా బట్టబయలైందన్నారు. దేశ మ్యాప్‌ను, భవిష్యత్తును మార్చేయాలని చూసిన రాజకీయ ఎత్తుగడను ప్రజాస్వామ్యం సమర్థవంతంగా అడ్డుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. మహిళా రిజర్వేషన్లకు ఇండియా కూటమి ఎప్పుడూ వ్యతిరేకం కాదు.. మా పోరాటం మహిళా సాధికారత కోసమే ! కానీ.. బీజేపీ మాత్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమ‌ర్శించారు.

నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. 2023లోనే బిల్లు ఆమోదం పొందినా, 2024 ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు ? కేవలం తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ పార్లమెంట్ డ్రామాలు ఆడుతుందన్నారు. డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేస్తూ మహిళను బీజేపీ మోసం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను ఇరుకున‌పెట్టి రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు డీలిమిటేష‌న్‌తో లింక్ పెడుతూ 131వ చట్ట సవరణ తీసుకొచ్చారు… కానీ..2023లో ఆమోదం పొందిన బిల్లును ఇప్ప‌టి వ‌ర‌కూ నోటిఫై చేయ‌లేదన్నారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి గుండెల్లి దేవి వ‌ర ప్ర‌సాద్‌, జ‌య‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page