హైదరాబాద్, అద్దం న్యూస్ : శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కందూరి కృష్ణ, మాజీ కార్పొరేటర్ పలుస బాల్రాజ్గౌడ్ ఆధ్వర్యంలో చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘ సేవకులు ప్రమోద్ అగర్వాల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కందూరి కౌషిక్, అడ్వకేట్ డాక్టర్.సంగీత జ్వాలావరాలను, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png