హైదరాబాద్, అద్దం న్యూస్ : జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-15 కొండాపూర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ శుక్రవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉన్న కొండాపూర్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి ?, ఎన్ని డెలివరీ చేస్తున్నారు ? తదితర వివరాలు తనిఖీ చేశారు. అనంతరం వాటర్ సప్లై, సీవరేజ్ పనులు, రెవెన్యూ బిల్లింగ్, కలెక్షన్, ఎంసీసీ ఫిర్యాదుల పరిస్కారం తదితర అంశాలపై ఆరా తీశారు. కాగా కొండాపూర్ ఫిల్లింగ్ స్టేషన్లో 2 ఫిల్లింగ్ పాయింట్స్, 28 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 300 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీజీఎం నారాయణ, జీఎం బ్రిజేష్, డీజీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు. 
ED inspects Kondapur filling station
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply