RTC bus Accident : ఆర్టీసి బ‌స్సు ఢీకొని మ‌హిళ మృతి

కాచిగూడ‌, జూలై 28, ( అద్దం న్యూస్ ) :   నింబోలి అడ్డా హర్రాస్‌పెంట వద్ద మంగళవారం ఉదయం 10.40 గంట‌ల స‌మ‌యంలో ఆర్టీసి బ‌స్సు ఢీకొన్న ప్రమాదంలో సోనాలి జాధవ్ ( 30 ) అనే వివాహిత మహిళ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న కాచిగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. కాచిగూడ పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి.. కాచిగూడ తిల‌క్‌న‌గ‌ర్‌కు చెందిన సోనాలి జాధ‌వ్ అనే మ‌హిళ హీరా జ్యులెల‌రిలో ఉద్యోగం చేస్తుండేది. ఇదిలా ఉండ‌గా ఈ నెల 28వ తేదీన మంగ‌ళ‌వారం ఉదయం నింబోలి అడ్డా హర్రాస్‌పెంట మీదుగా ఆమె టీవీఎస్ జూపిటర్ స్కూటీపై ఉద్యోగానికి వెళ్తుండగా,   ( TS 30 T 3688 ) నంబ‌ర్ గ‌ల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ( బస్సు ముందు చక్రాల కింద పడి ) ఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతురాలి సోదరుడు రాహుల్ మోరే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page