కాచిగూడ, మే 23, అద్దం న్యూస్ : కాచిగూడ ప్రాంతానికి చెందిన జిహెచ్ఎంసి డిపార్ట్ మెంట్ లోని హార్టికల్చర్ విభాగంలో అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్ కుమార్ ( 56 ) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విజయ్ కుమార్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విజయకుమార్ మరణంతో భార్య, కూతుర్ల హృదయ ఆవేదనను ఆపడం బంధువుల, స్నేహితుల ఎవరి తరం కాలేదు. ఆయన పార్థీవ దేహాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేడు హర్రస్ పెంటలోని హిందూ స్మశాన వాటికలో విజయ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply