హైదరాబాద్, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆర్టీసి క్రాస్రోడ్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు చెప్పిన పంచాంగ శ్రవణాన్ని కార్పొరేటర్ దంపతులు విన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, ఆకుల సురేందర్, రాజమోహన్, భక్తులు పాల్గొన్నారు.














Leave a Reply