తెలంగాణ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ సూపరవైజరి స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 28, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ సూపరవైజరి స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడిగా సిరిగిరి కిరణ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ జగత్కాంతరావు, ప్రధాన కార్యదర్శి ఎ.ప్రవీణ్ కుమార్, చీఫ్ అడ్వయిజర్లు విజయ్ కుమార్, సయ్యద్ అక్బర్, మోహన్ రావు, చీఫ్ ఉపాధ్యక్షులు గోపిక్రిష్ణ, రమణ మూర్తి, కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, వెంకటరమణ, అమ్రేష్, మురళీ, సయ్యద్ జావీద్, నరేందర్, సలహాదారులు శివానంద్, ప్రవీణ్, ఆబిద్ అలీ, కోశాధికారి సుబ్బారెడ్డి, వై.రాజు, ఆర్గనైజర్లు రాజశేఖరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply