బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు

హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ కృష్ణానగర్ బస్తీలో ఆదివారం భారత తొలి మాజీ ఉప ప్రదాన మంత్రి, స్వాతంత్య్ర సమరయోదుడు బాబూ జగ్జీవన్రామ్ వర్థంతి కార్యక్రమం జరిగింది. కృష్ణానగర్ బస్తీ అధ్యక్షుడు వై.శాంతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బస్తీవాసులు హాజరై బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ దేవాలయం ఛైర్మన్ రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి స్వామిరావు, హరి, నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply