Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadజలమండలిలో 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :   జ‌ల‌మండ‌లిలో వివిధ హోదాల్లో ప‌నిచేసిన 53 మంది ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. బోర్డు ప‌రిధిలోని పలు డివిజన్లలో పనిచేసిన వీరంతా.. గ‌త నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఇందులో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ముగ్గురు సీనియర్ ఆఫీసర్లలతో పాటు మరో 47 మంది వివిధ హోదాలో ప‌నిచేశారు. వీరంద‌ర్నీ ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎం సురేష్, జీఎం సరస్వతి, ఉద్యోగులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page