అంబర్పేట్, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఉచిత కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సా శిబిరాన్ని ఈనెల 25 న హబ్సిగూడ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు యోగక్షేమం వహామ్యహం ఛారిటీ ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపకులు వారణాసి కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ… శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మరుసటి లిబర్టీలోని సాధూరామ్ కంటి ఆసుపత్రిలో నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 93460 12864 ను సంప్రదించాలన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
