బాకారం శ్రీ పోచమ్మ దేవాలయం ప్రహరి గోడ నిర్మాణం పూర్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 15, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ బాకారం శ్రీ పోచమ్మ దేవాలయం ప్రహరిగోడ నిర్మాణం పూర్తి అయింది. వర్షాలకు కూలిపోయిన ప్రహరిగోడను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ లు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆలయంలో ఆదేశించారు. బాకారం ధర్మ చరణ సమితి అధ్యక్షుడు పాశం అనిల్ కుమార్ యాదవ్, కార్యదర్శి మార్క రమేష్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బి.మహేష్ కుమార్ గౌడ్, కలకోట అరుణ్, వెంకటేశ్వర్లు, పాశం అరవింద్, శేఖర్ చంద్ర, పాశం సునీల్ లు, బస్తీ వాసుల సహకారంతో నూతనంగా ప్రహరి గోడను నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. బాకారం ధర్మ చరణ సమితి అధ్యక్షుడు పాశం అనిల్ కుమార్ యాదవ్, కార్యదర్శి మార్క రమేష్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బి.మహేష్ కుమార్ గౌడ్, కలకోట అరుణ్, వెంకటేశ్వర్లు, పాశం అరవింద్, శేఖర్ చంద్ర, పాశం సునీల్, ఆలయ సిబ్బంది మిక్కిలినేని సురేష్ ల పర్యవేక్షణలో ప్రహరిగోడ నిర్మాణం పూర్తి అయింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
