తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు ‘సంక్షేమం’ అంటే తెలియ‌దు

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ లో 11 ఏళ్లుగా కళాకారులకు ‘సంక్షేమం’ అంటే తెలియద‌ని, సాంస్కృతిక రంగానికి బడ్జెట్ కేటాయించ‌క‌పోవ‌డం చూస్తుంటే పాల‌కుల ప‌ట్ల‌ కళాకారుల‌కు ఎంత చిత్త‌శుద్ధి ఉందో అర్థం అవుతుంద‌ని ప‌లువురు వ‌క్త‌లు అన్నారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో టిపిఎస్‌కె, పిఎన్ఎం ల సంయుక్తాధ్వ‌ర్యంలో రౌండ్‌టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టిపిఎస్‌కె రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా మాట్లాడుతూ… తెలంగాణలో ఆట-పాట ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య అని… ఇక్కడ పాటలే ముందుండి ప్రజలను నడిపించినవ‌న్నారు. ఇక్కడ ఆటపాటలే పెట్టని కోటలై నిలిచాయ‌ని, పాటలే కోటి కంఠాలై మ్రొగాయ‌ని… పాటలే రాష్ట్రానికి పట్టాభిషేకాలు పాట ఆటల భిక్షే కదా ఈనాడు మీరేలే పదవులని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలనలో ఈ సంవత్సరం 2025 -26 బడ్జెట్‌లో 74 కోట్ల 35 లక్షల రూపాయలు సాంస్కృతిక రంగానికి కేటాయించినట్లు పేర్కొన్నారని.. ఇందులో సాంస్కృతిక సారధి కళాకారులు జీతాలు, సాంస్కృతిక రంగం జీతభత్యాల, నిర్వహణ కిందనే 34 కోట్ల 35 లక్షలు ఇవి పోగా 40 కోట్లు తెలంగాణ కళాకారుల అభివృద్ధి ఖాతా కింద అని అన్నారు. నిజంగా ఈ 40 కోట్లు ఎవ్వరికి ఖర్చు చేశారు… వీటికి లెక్కలు చెప్తారా ? అని ప్ర‌శ్నించారు. పారదర్శకత లేని సాంస్కృతిక శాఖ ఒకసారి గత బడ్జెట్ ను 2024- 25 చూసినట్లయితే 72 కోట్లు కేటాయించారని, అదనంగా కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసమని 13 కోట్ల 58 లక్షలు కేటాయించి ఆ వృద్ధాప్య పింఛన్లు కూడా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. మిగతా ఏడు కోట్లు ఏమైయ్యాయంటే అవి దారి మళ్లించి మళ్లీ వెనక్కి తీసుకున్నారని విమ‌ర్శించారు.

తెలంగాణ నాటక రంగం నుంచి కె.శాంతారావు మాట్లాడుతూ… బడ్జెట్ కేటాయింపులు కేవలం అంకెలు, సంఖ్యలు పెద్ద మాయ అని అన్నారు.  కర్ణాటక ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ జానపద అకాడమీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నప్ప‌టికి పట్టించుకోకుండా తప్పుల తడక బడ్జెట్ ప్రవేశ పెట్టినారని అవేదన వ్యక్తం చేశారు. కళాకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మురళీధర్ దేశ్పాండే మాట్లాడుతూ… తెలంగాణ కళాకారులను మరోసారి మోసం చేయడమేనని.. ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులకు న్యాయం జరిగిందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు రాకేష్, రావణ్, తెలంగాణ ప్రజా నాట్య మండలి శ్రీనివాస్, సాంబరాజు, యాదగిరి, పి కళ్యాణ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, ఆశన్న, టిపిఎస్‌కె నరేష్, రాజయ్య, తెలంగాణ సాంస్కృతిక సంఘం డప్పు స్వామి, జానపద వృత్తి కళాకారుల సంఘం భాస్కర్, కళాకారిణి గిరిజ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చేసిన‌ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి దగా పడిన కళాకారుల డప్పుల దరువు కు సిద్ధం కావలంటూ పిలుపు ఇచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page