Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ పావ‌ని

సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ పావ‌ని

📰 Generate e-Paper Clip

సివ‌రేజి పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ పావ‌ని

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 6, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బిఎన్‌రెడ్డి లేన్‌, నిమ్కార్ లేన్‌లో రూ. 8 ల‌క్ష‌ల నిధుల‌తో ప్రారంభ‌మైన నూత‌న సివ‌రేజి పైప్‌లైన్ ఏర్పాటు ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ శుక్ర‌వారం ప‌రిశీలించారు. వాట‌ర్ వ‌ర్క్స్ డిజిఎం కార్తీక్ రెడ్డి, మేనేజ‌ర్ కృష్ణ‌మోహ‌న్ ల‌తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని ఆయా బ‌స్తీల్లో ప‌ర్య‌టించి పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. స్థానికుల విజ్ఞ‌ప్తి మేర‌కు ప‌నుల వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాల‌ని కాంట్రాక్ట‌ర్‌ను కార్పొరేట‌ర్ పావ‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్‌, బిజెపి డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్‌రావు, సాయికుమార్, బిజెవైఎం నాయ‌కులు అరుణ్ కుమార్‌, జ్ఞానేశ్వ‌ర్‌, స్థానికులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page