బస్సులో మంటలు..
ఆటోడ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
అద్దం న్యూస్, వెబ్డెస్క్: పుదుచ్చేరిలో సోమవారం రాత్రి ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఒక సామాన్య ఆటో డ్రైవర్ చూపిన అప్రమత్తత వల్ల 13 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు. పుదుచ్చేరి నుండి పొల్లాచికి బయలుదేరిన ఒక లగ్జరీ బస్సు, సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ముదలియార్పేట సమీపంలోని 100 ఫీట్ల రోడ్డుపై వెళ్తోంది. ఆ సమయంలో బస్సు వెనుక భాగం నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడం ప్రారంభమయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులకు గానీ, డ్రైవర్కు గానీ ఈ విషయం తెలియదు.
ఆపద్బాంధవుడిలా ఆటో డ్రైవర్
అదే మార్గంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్, బస్సు వెనుక మంటలు రావడాన్ని గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఆటోను వేగంగా పోనిచ్చి, సైగల ద్వారా బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేసి, లోపల ఉన్న 13 మంది ప్రయాణికులను కిందకు దిగిపోవాల్సిందిగా కోరారు. ప్రయాణికులందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రయాణికుల సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైనప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply